(అమరావతి నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి)
అధికార వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని నోటి వెంట బీజెపీ, జనసేన మాటరావడం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా అవును నిజంగా అన్నారు. ఏ సందర్భంలో, ఎందుకు అన్నారు అంటే..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లి ట్రాక్టర్ ప్రమాదానికి గురి చేసిన విషయం తెలిసిందే. లోకేష్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలోకి దూసుకువెళ్లడంతో పక్కన ఉన్న నాయకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హేళనగా ట్వీట్లు చేయడం, మాట్లాడటం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని తన దైన శైలిలో లోకేష్ పై వ్యాఖ్యలు చేశారు.
దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు లోకేష్ చందం ఉందన్నారు. వరదలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పరిశీలిస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. “లోకేష్ ఆఫ్ నాలెడ్జ్ నాయకుడు, ఆయనకు ట్రాక్టర్ నడపడం రాదు, పార్టీ నడపడం రాదు. ట్రాక్టర్ ఎక్కితే వాళ్లందరినీ గోతిలో పడేయ్యబోయాడు, రేపు పార్టీని కూడా అంతే గోదాట్లో కలిపిస్తాడు, తెలివిగల వాళ్లు ఎవరైనా ఉంటే వైసీపీ ఉంది లేకుంటే బీజీపీ, జనసేన ఇతర పార్టీలో చేరిపోండి” అంటూ హితవు పలికారు కొడాలి నాని.
లోకేష్ ట్రాక్టర్ ప్రమాద విషయాన్ని మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నది.