NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న పక్షాలు..!!

 

సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇన్నాళ్లు సంక్షేమ రధాన్ని పరుగులు పెట్టించారు. పరిపాలనా రధాన్ని పట్టాలు ఎక్కించారు. అక్కడక్కడా ఆరోపణలు, వివాదాలు, విమర్శలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అన్ని కలిసిన దాఖలాలు లేవు. జగన్ మాటకు ఎదురే లేకుండా రాష్ట్రంలో పరిపాలన సుభిక్షంగా సాగింది. అయితే జగన్ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం వ్యతిరేక పక్షాలను ఏకం చేసేదిలా ఉంది. ఆ నిర్ణయం అమలు అయితే రైతులకు మేలు జరుగుతుందని వైసిపి ప్రభుత్వం చెబుతుండగా రైతులకు మేలు కంటే కీడే ఏక్కువ అని విపక్షాలు అన్నీ ఆరోపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వంపై పోరాడటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టే దిశగా విపక్షాలు అన్నీ అడుగులు వేస్తున్నాయి.

ap cm ys jagan

వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అమలులో భాగంగా నగదు బదిలీ విధానానికి మీటర్లు బిగించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా నుండి ఉచిత విద్యుత్ మీటర్ల బిగించే కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, దానిని వ్యతికేకిస్తూ అక్కడి నుండే విద్యుత్ మీటర్లను పగులగొట్టే కార్యక్రమాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి కార్యక్రమానికి చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని నగదు బదిలీగా మార్చడం తగదని ఆయన అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా కన్పిస్తోందని పేర్కొన్నారు. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా సమైక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కరోన కేసుల ఉదృతికి ప్రదాన మంత్రి మోడీనే కారణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కరోనా పరిస్థితులను అడ్డుపెట్టుకొని బలవంతంగా విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని చూడటం తగదని వడ్డే అన్నారు.

విజయవాడలో వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నేతలు, సామాజిక ఉద్యమ కారులు, విశ్లేషకులతో చర్చా వేదిక నిర్వహించి దీనిపై ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ జి గంగాధర్, రైతు సంఘాల సమాఖ్య రాష్ట నాయకుడు ఏర్నేని నాగేంద్రనాధ్, ఏఐకెఎస్ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య , రాజకీయ విశ్లేషకులు సయ్యద్ రఫీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వై కేశవరావు తదితరులు మాట్లాడుతూ నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ కు ఆయన తనయుడు జగన్ తూట్లు పొడవడం దుర్మార్ఘమైన చర్య అని అన్నారు. కరోనా సమయంలో ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా విద్యుత్ మీటర్లు బిగింపు ను పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యుత్ మీటర్ల బిగింపును ఎన్ టి ఆర్ వ్యతిరేకించారని గుర్తు వారు చేశారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా మీటర్ల వ్యవస్థను ప్రవేశపెడితే దానిపై పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ల బిగింపు చర్యలను ప్రభుత్వం తక్షణమే విడనాడాలని నేతలు డిమాండ్ చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?