ఏదో రకంగా వైసిపి పార్టీని ఇబ్బంది పెట్టాలని, ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం మొదటినుండి కనిపిస్తూనే ఉంది. ఏపీ సీఎం జగన్ పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అందుబాటులోకి తేవాలని తీసుకున్న నిర్ణయం నాటి నుండి అనేక రీతులుగా ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లడానికి రాజుగారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ ప్రయత్నాలు ఆటలో అరటి పండు లాగా ఆవిరైపోతున్నాయి అనే టాక్ గట్టిగ వినబడుతుంది.
రఘురామకృష్ణంరాజు చేసే ఆరోపణల్లో చాలా వరకు మేటర్ లేకపోవడంతో ఏపీ పాలిటిక్స్ లో జోకర్ గా ఆయన వ్యవహారం ఉందన్న వాదన ఇటీవల గట్టిగా వినబడుతుంది. మొదటిలో వైసీపీ పార్టీ పేరు విషయంలో, చాలా హడావిడి చేసినా రాజుగారు జగన్ అపాయింట్ మెంట్ విషయంలో మీడియా తనకు సహకరిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని ఒక టైం లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత అసలు నాకు జగన్ కి మధ్య మీడియా వివాదాలు సృష్టిస్తూ ఉంది అంటూ… మీడియా మీద మండిపడ్డారు. నా కాపురం చెడగొడుతుంది మీడియానే అంటూ… రివర్స్ అయ్యారు. దీంతో చాలా వరకు రఘురామకృష్ణంరాజు నవ్వుల పాలయ్యారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు “న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్” చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం పై వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే మీడియా వార్తలు వడి వారిస్తున్నాయి. దీంతో సదరు మీడియా ఛానల్స్ తానా అంటే తందానా అన్నట్లుగా తాజాగా రఘురామకృష్ణంరాజు కూడా రంగంలోకి దిగారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని… అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తాను ఫోన్ చేస్తుంటే, అవతాల వ్యక్తితో మాట్లాడుతుంటే ఏవో శబ్దాలు వస్తున్నాయి అని, ఖచ్చితంగా ఇది ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపించారు.
దీంతో సోషల్ మీడియాలో రాజుగారు చేస్తున్న ఆరోపణలపై సెటైర్లు వస్తున్నాయి. శబ్దాలు వస్తే ఫోన్ ట్యాపింగ్ అని అనటం చాలా దారుణమని… ఆయన చేస్తున్న ప్రకటనలు చాలా విచిత్రంగా ఉన్నాయని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక విషయంలో ఫోన్ ట్యాపింగ్ అని వార్తలు వస్తే మిగతావన్నీ అలాగే ఉంటాయి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక ఉద్దేశపూర్వకంగా ఏపీ ప్రభుత్వంపై బురద చల్లాలని రఘురామకృష్ణంరాజు చేస్తున్న హడావిడి కనిపిస్తుందని, మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.