అమరావతి: విశాఖకు కార్యనిర్వాహక రాజధాని తరలించడం వెనుక అక్కడి భూములపై వైసిపి నేతల కన్ను ఉందని టిడిపి ఆరోపిస్తున్నది. విజయసాయి రెడ్డి ప్రభృతులు ముదే అక్కడ వేలాది ఎకరాల భూములు సేకరించారని టిడిపి నాయకులు అంటున్నారు. తాజాగా టిడిపి పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానీ కూడా అదే విమర్శకు దిగారు.
జగనన్న అండ్ గ్యాంగ్ బారి నుంచి విశాఖను దేవుడే రక్షించాలని ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ కేంద్రంగా పాకిస్థాన్కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న నేవీ ఉద్యోగుల గుట్టు బయటపడిన నేపధ్యంలో ఒక దినపత్రికలో వచ్చిన కథనాన్ని నానీ తన ట్వీట్కు ట్యాగ్ చేశారు. పాకిస్థాన్ నుంచి విశాఖను రక్షించేందుకు భారత సైన్యం ఉంది. కానీ విశాఖకు అసలు ముప్పు జగనన్న అండ్ గ్యాంగ్ నుంచే ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారత దేశ సైన్యం వుంది కాని విశాఖకు అసలు ముప్పు ప్రస్తుతం మన జగన్నన అండ్ గ్యాంగ్ @ysjagan @YSRCParty వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి. pic.twitter.com/kIZRGpqiu8
— Kesineni Nani (@kesineni_nani) December 23, 2019