అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విధ్వంసంతో ప్రారంభం అయిన వైసిపి ఆరు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ని సుసైడ్ ప్రదేశ్గా మార్చారని అన్నారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తా అన్న జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాట మార్చి ప్రజలకు నవరత్న తైలం రాసారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
‘ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యం. సంక్షేమం సున్నా. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక మాయ. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ గారు మహిళల్ని మోసం చెయ్యడం, రైతులను దగా చెయ్యడం, యువతని నిలువునా ముంచటం, పేదవాడి పొట్ట కొట్టటం మాత్రమే నిజం’ అంటూ ట్వీట్ చేశారు. వృద్ధులకు నెలకు 250 రూపాయలు, రైతులకు 625 రూపాయలు ఇస్తున్న జగన్ గ్రామ వాలంటీర్ల పేరుతో వైసిపి కార్యకర్తలకు నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తూ ఏడాదికి నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని లోకేష్ విమర్శించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?