ఏపిలోని వైసీపీ ప్రభుత్వంపై పిర్యాదులు చేసేందుకు టీడీపీ ఎంపిల బృందం హస్తినకు బయలు దేరింది. టీడీపీ ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రబాబులు ఢిల్లీలో ఉదయం 11గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మధ్యాన్నం ఒంటి గంటకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లను కలువనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లు ఖరారు అయినట్లు సమాచారం.
రాష్ట్రపతిని ఎందుకు కలుస్తున్నారంటే….
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులు కాలరాస్తుందని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.13నెలలుగా రాష్ట్రంలో జరిగిన పలు పరిణామాలను రాష్ట్రపతికి ఎంపీలు నివేదించాలని నిర్ణయించారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై
ఫిర్యాదు చేయనున్నారు.
రాష్ట్రంలో వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు తెగబడు తున్నారనీ, టీడీపీతో సహా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారనీ, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు, అదే విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపైనా అక్రమ కేసులు బనాయిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని రాష్ట్రపతికి టీడీపీ ఎంపీల బృందం పిర్యాదు చేయనున్నది.
కేంద్ర మంత్రి తోమర్ ను ఎందుకంటే..
రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ (నాగేరా) పనులకు సంబంధించి 13 నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్కి ఫిర్యాదు చేయనున్నారు. నగేరా చెల్లింపులకు సంబంధించి కేంద్రం లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి తోమర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. నరేగా నిబంధనలను ఏపీలో అమలు కావడం లేదని తెలియ చేయనున్నారుట. ఇళ్ల స్థలాల లెవలింగ్లో రూ.1,560 కోట్ల స్కామ్ జరిగినట్లు ఫిర్యాదు చేయనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులన్నీ ఒకే పనికి మళ్లించి, ఇతర పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర మంత్రికి పిర్యాదు చేయనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?