Ap Tenth Exam’s: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం టీచర్లకు వ్యాక్సిన్ పూర్తయ్యాకే పరీక్షలు నిర్వహించాలని పిటిషన్ వేయడంతో ఏపీ హైకోర్టు పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ జూన్ 18 వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మొదటి నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించకూడదని .. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉందని విపక్షాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరో పక్క ప్రభుత్వం మాత్రం విద్యార్థి భవిష్యత్తు పదవ తరగతి పరీక్షలు దిశానిర్దేశం చేస్తాయని స్పష్టం చేస్తూ ..ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తామని ఏపీ మంత్రులు తెలిపారు. ఇలాంటి తరుణంలో హైకోర్టు పరీక్షలు వాయిదా వేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వాస్తవానికి పదవ తరగతి పరీక్షలు వచ్చే నెల 7వ తారీఖు జరగాల్సి ఉంది. తాజాగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయడంతో .. జులై నెలలో మళ్లీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాని పరిస్థితి ఏర్పడటంతో .. ప్రభుత్వం కూడా కోర్టు ఆదేశాలను పాటిస్తూ పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయడం జరిగింది.