ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లుగా ఏపికి మూడు రాజధానులు వచ్చేస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ఒక అంకం పూర్తి అయ్యింది. కోర్టు వ్యవహారాలు ఎలా ఉన్నా.. పరిపాలనా వ్యవస్థ ను విశాఖ కు తరలించడానికి ప్రభుత్వం చకచెకా అడుగులు వేస్తున్నది. ఆగస్టు 15 నుండే దశల వారీగా సచివాలయ కార్యకలాపాలు విశాఖకు తరలించనున్నారు.
జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. అయితే పరిపాలన, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఒకే చూట కాకుండా మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల వచ్చే కష్ట నష్టాల గురించి ఒ సగటు వ్యక్తి వ్యక్తం చేసిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందేమా చూద్దాం.
ఒ సగటు వ్యక్తి డౌట్ ఏమిటంటే మూడు రాజధానుల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏమిటి?, శాసన, పాలన, న్యాయ వ్యవస్థలు ఒకే ప్రాంతంలో పెట్టుకొని రాజధానిగా చేసుకొని.. మిగిలిన అన్ని ప్రాంతాలను వివిధ రకాల హబ్ ల ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు కదా?. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వల్ల శాసన రాజధాని అమరావతి నుండి పరిపాలన రాజధాని విశాఖకు వెళ్లాలంటే 300 కిలో మీటర్లు ప్రయాణించాలి. అదే విధంగా పరిపాలన రాజధాని విశాఖ నుండి న్యాయ రాజధాని కర్నూలు కు వెళ్లాలంటే 700 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.
ఇలా ప్రయాణాలకు ఎంత డబ్బు, ఎంత సమయం వృధా అవుతుందో గమనించారా మరి. ఉదాహరణకు తీసుకుంటే..పరిపాలన రాజధాని నుండి ఒ విభాగ హెచ్ఒడి వారి సిబ్బందితో కోర్టు పనిమీద (వాయిదాలకు) కర్నూలు హైకోర్టుకు వెళ్లి రావాలంటే అటూ, ఇటూ ప్రయాణానికి 24 గంటలు సమయం, వాహనాలకు కనీసం లక్ష ఖర్చు అయ్యే పరిస్థితి. అదే విధంగా విశాఖ నుండి శాసనసభ నిమిత్తం అమరావతి వచ్చి, మళ్ళీ వెళ్లాలంటే 18 గంటల సమయం, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు తప్పదు. ఈ పరిస్థితిలో ఖర్చు ఎలాగూ తప్పదు కాబట్టి ప్రభుత్వం తరపున అన్ని శాఖలకు ఒక్కో ‘హెలికాఫ్టర్’ కొనుగోలు చేసి ఇచ్చేస్తే అప్పుడు ప్రయాణ భారం తగ్గడంతో పాటు సమయం, ఖర్చు కలిసి వస్తాయని అంటున్నారు సెటైరిటికల్ గా!