ఓటర్ల జాబితా విడుదల
అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్లొ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ శనివారం వెలువరించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 అని తెలిపింది. వీరిలో పురుషులు 1,83,24,588 మంది, మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు 3,761 మంది ఉన్నారు. అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య: శ్రీకాకుళం 20,64,330,
విజయనగరం 17,33,667,
విశాఖ 32,80,028
తూ.గో. 40,13,770
ప.గో. 30,57,922
కృష్ణా 33,03,592
గుంటూరు 37,46,072
ప్రకాశం 24,95,383
నెల్లూరు 22,06,652
కడప 20,56,660
కర్నూలు 28,90,884
అనంత 30,58,909
చిత్తూరు 30,25,222.
త్వరలో లోకసభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
previous post
next post