టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ లపై తరచూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారని మాట వినిపిస్తోంది. తరచూ టీడీపీ నాయకులను బూతులతో తిడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే కొడాలి ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నారో ఎవరికి అర్ధం కావడం లేదంట.
కొడాలి నాని గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఊహించని విధంగా ఆయనకి జగన్ మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖ వరించింది. ఇటీవల వైకాపాలోని సీనియర్ లు కొందరు ఆయన ను పక్కన పెడుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా ఆయన మంత్రిత్వ శాఖకి సంబందించిన రివ్యూ సమావేశం కూడా మరో మంత్రి నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకి, పార్టీ అధిష్టానానికి కాస్త గ్యాప్ వచ్చిందని, పార్టీ అధిష్టానానికి ఆయనకు గ్యాప్ పెట్టేలా కొందరు పావులు కదిపారని వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది.
కొడాలి నానిని పక్కకు పెడితే అదే సామాజికవర్గానికి చెందిన మైలవరం నుంచి దేవినేని ఉమాపై విజయం సాధించిన వసంత కృష్ణ ప్రసాద్(కేపీ)ని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ అధిష్టానంలోని కీలక నేతలతో కేపీకి వ్యాపార సంభంధమైన మితృత్వం కూడా ఉందని, కేపీని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సిఎం వైఎస్ జగన్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు అని అందుకే ఇప్పుడు నానీని పక్కన పెడుతున్నారు అని అంటున్నారు.
త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఈ మార్పు జరగవచ్చని తెలుస్తుంది. నానీ పని తీరు విషయంలో సిఎం వైఎస్ జగన్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయనను పక్కన పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నాని ఆయన జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదని అంటున్నారు.
నాని బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా పేరుంది. టిడిపికి కంచుకోట అయిన గుడివాడ నియోజక వర్గం నుండి నాలుగు సార్లు విజయం సాధించారు. సీఎం జగన్ కి ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటున్నారు. అయితే ఆయనకి, పార్టీకి మధ్య గ్యాప్ పెరగటానికి కారణం ఎవరో, ఏమిటో? మీకు తెలుసా? గెస్ చేయండి!