Israel: గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో భారీగా విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాదాపు రోజుకు కొన్ని వందలాది రాకెట్లు వదులుతూ ఉండటంతో ఇజ్రాయెల్ దేశంలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఐరన్ డోమ్ ఏర్పాటు చేసుకోవటంతో ఉగ్రవాదులు వదులుతున్న రాకెట్లు గాల్లోనే నిర్విర్యం అవ్వుతున్నాయి. మరికొన్ని ఖాళీ ప్రదేశాల్లో పడిపోతున్నాయి.
గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం పై జరుగుతున్న దాడి అంతర్జాతీయస్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. అల్ అక్సా మస్జిద్ వద్ద మొదలైన గొడవలు మెల్ల మెల్లగా ఇప్పుడు పాకి పోతున్నాయి. దీంతో ఇజ్రాయేల్ శత్రు దేశాలు రంగంలోకి దిగి పాలస్తీనా ప్రాంత ప్రజలకు మద్దతు తెలుపుతూ లెబనాన్, టర్కీ మరికొన్ని ముస్లిం దేశాల్లో ఒకటి కావాలి అన్నీ రెడీ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే టర్కీ అధ్యక్షుడు రంగంలోకి దిగి ఇజ్రాయిల్ దేశాన్ని కనుమరుగు చేయాలన్న లక్ష్యంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ఇజ్రాయేల్ తమ దేశ పౌరులను రక్షించుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని యుద్ధం అంటే సై అన్న తరహాలో రెడీ అవుతున్నాయి. ఇజ్రాయిల్ ప్రాంతాలలో అనగా యూద జనాభా సాంద్రత కలిగిన టెల్ అవీవ్, అష్కేలోన్ అనే ఈ ప్రాంతాలను లక్ష్యం చేసుకుని భారీగా ఉగ్రవాదులు రాకెట్లు వదులుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ చుట్టుప్రక్కల పరిస్థితి చూస్తే అన్ని అరబ్ దేశాలు ఏకమయ్యే పరిస్థితి కనబడుతోంది. మరోపక్క ఇజ్రాయేల్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్న తరహాలో వ్యవహరిస్తోంది. మొత్తం మీద మధ్య ఆసియా ప్రాంతం మొత్తం యుద్ధమేఘాలు అలుముకున్నట్లు తెలుస్తోంది.