రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ‘అర్ణబ్ గోస్వామి’.. ప్రస్తుతం భారత మీడియాలో ఈ పేరు ఓ సంచలనం.. అంతకుమించి ఓ వివాదం. సినీ హీరోలకు, కొందరు రాజకీయ నాయకులకు ఉండే మాస్ ఫాలోయింగ్ అర్ణబ్ కీ ఉందంటే అతిశయోక్తి కాదు. విషయం ఏదైనా తన స్టయిల్లో దానికి సూపర్ క్రేజ్ తీసుకొచ్చి భారీ క్రేజ్ తీసుకొస్తాడు. ‘జర్నలిజం అంటే నోరేసుకు పడిపోవడం కాదు.. బ్రెయిన్ వేసుకు పడిపోవడం’ అని మన బ్రహ్మానందం తో ఓ సినిమాలో డైలాగ్ చెప్పించాడు పూరి. ఇది అర్ణబ్ కు అతికినట్టు సరిపోతుంది. ఇదే నోరు ఇప్పుడు అర్ణబ్ కు చుక్కలు చూపించింది. న్యూస్ రూమ్ లో వార్తలు, రాజకీయాల్ని అనాలసిస్ చేసే అర్ణబ్ ను జైలు నాలుగ్గోడల మధ్య కూర్చోబెట్టింది. అయితే.. ప్రస్తుత పరిస్థితులు అర్ణబ్ అనుకూలంగానే ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వానికే చురకలు..
ఇటివల అర్ణబ్ తన షోలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇరకాటంలో పడేశాయి. ఏకంగా ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసింది మహా ప్రభుత్వం. దీనిపై ఆయన్ను అరెస్టు కూడా చేశారు. దేశవ్యాప్తంగా అర్ణబ్ అరెస్టు తీవ్ర సంచలనం రేపింది. పోలీస్ వ్యాన్ లో ఎక్కించి మరీ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. దీనిపై అర్ణబ్ సుప్రీంకోర్టులో మహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్ వేశారు కూడా. స్పందించిన అత్యున్నత ధర్మాసనం మహా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. మీకు కోర్టు ధిక్కారం నోటీసు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సభాహక్కుల ఉల్లంఘన నోటీసు విషయంలో తదుపరి విచారణ జరిగేవరకూ అర్ణబ్ ను అరెస్ట్ చేయరాదని కూడా చెప్పింది.
అర్ణబ్ కు బీజేపీ మద్దతు..
అర్ణబ్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ‘అర్ణబ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అర్ణబ్ ను బెదిరిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. వరుసగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులో ఆయనకు ఊరట అవసరం’ అని సుప్రీంకోర్టులో విన్నవించారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కక్షిదారుగా చేర్చాలని వాదించడం విశేషం. అర్ణబ్ పై న్యాయమూర్తి వాదనలను సుప్రీంకోర్టు సమర్ధించింది. మరోపక్క అర్ణబ్ ను సమర్ధిస్తూ బీజేపీ అగ్ర నేతలు కూడా ఆయనకు సంఘీభావం తెలపడం విశేషం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?