హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకై వైసిపి అధినేత వైఎస్ జగన్కి విజయం చేకూర్చాలని ప్రజలకు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోది ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు హోదా సాధించలేదని అసదుద్దీన్ అన్నారు.
కేంద్రంలో బిజెపి, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందనీ, కొద్ది రోజుల్లో మోది మాజీ ప్రధాని కానున్నారని అసదుద్దీన్ జోస్యం చెప్పారు. ప్రధాని పదవికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు అర్హత ఉందని అసదుద్దీన్ అన్నారు.
ఆంధ్రలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అసదుద్దీన్ పేర్కొన్నారు.
రాజకీయ నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు అని అసదుద్దీన్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు.