కరోనా లాంటి కష్టకాలంలో పైగా ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఇలాంటి లో కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా వైయస్ జగన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చే 16 నెలలు కావస్తున్నా క్రమంలో జగన్ అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి తాజాగా ఇటీవల ఓ రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్ లో నుండి తేపించుకున్నట్లు సమాచారం.
ఈ తరుణంలో రిపోర్టులో వచ్చిన ఫలితాలు చూసి జగన్ ఎన్నడూ లేనంతగా అసంతృప్తిగా ఉన్నట్లు వైసీపీ పార్టీలో టాక్. మతాలకు అతీతంగా రాజకీయాలకతీతంగా పార్టీలను కూడా పట్టించుకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ఆ తర్వాత కూడా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడం లేదని కొంతమంది మధ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు పార్టీకి అనుకూలంగా ఉండే వారికి ఇచ్చే రీతిలో వ్యవహరిస్తున్నట్లు తాజా నివేదికలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో వెంటనే అసలు ససేమిర ఎలాంటి రాజకీయ పార్టీలు చూడకూడదు ప్రతి ఒక్కరికి సంక్షేమలు అందేలా వ్యవహరించాలి ఇలాంటి వాటికి ఒప్పుకోను అని… మంత్రులకు తాజా పరిస్థితుల పై జగన్ అసంతృప్తి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా మంత్రివర్గంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జగన్ అప్రమత్తం అయినట్లు సమాచారం.
ఈ విషయంలో చీఫ్ సెక్రటరీ నీలం సహాని ని కూడా ఇన్వాల్వ్ చేసి…. క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యే పనితీరు కరెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే రీతిలో సీఎస్ కి జగన్ ఆదేశాలు ఇవ్వటానికి రెడీ అయినట్లు సమాచారం. ఎక్కువగా ఉత్తరాంధ్రలో, రాయలసీమ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయట.