2019 ఎన్నికల ఫలితాలు చంద్రబాబు కి పార్టీని నడిపించడానికి మరింత భారాన్ని పెంచే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొనఊపిరితో అన్నట్టుగా చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షనేతగా రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుండి జంప్ అయిపోయారు. మరోపక్క అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమ పథకాలతో చాలా తెలివిగా ఓటు బ్యాంకు పెంచుకుంటూ మరోపక్క టీడీపీ భూస్థాపితం చేసే రీతిలో ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ పడేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి ఇప్పటివరకు ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చే రీతిలో ఏ విధంగాను పైచెయ్యి సాధించలేకపోయింది.
ఇసుక విషయంలోగాని ఇంగ్లీష్ మీడియం విషయంలోగాని పోరాటాలు చేసినా పెద్దగా ప్రజల నుండి స్పందన చంద్రబాబు పార్టీకి రాలేదు. మరోపక్క ప్రస్తుతం బిజెపి పార్టీ చాలా యాక్టివ్ గా మారింది. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మతవిశ్వాసాల చుట్టూ తిరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. దేవాలయాలపై దాడులు అంతర్వేదిలో రధం దగ్ధం అవటం తో పాటు దుర్గగుడిలో సింహాలు పోవటంతో ప్రభుత్వంపై విమర్శలు భారీ స్థాయిలో వస్తున్నాయి. మరోపక్క వైసీపీ మంత్రులు ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో చేస్తున్న కామెంట్లు ఆ పార్టీకి పెద్ద తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. విగ్రహం చెయ్యి విరిగి పోతే నష్టం ఏమిటంట, రథం కాలిపోతే ఇంకో రథం ఇస్తాం, వెండి సింహాలు ఖరీదు అయిదారు లక్షలే గా అన్నటుగా తీసిపారేసే రీతిలో కామెంట్ చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ఈ విషయంలో గనుక చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకువస్తే పార్టీ టోటల్ కొలాప్స్ అనుకుంటున్నా చివరి నిమిషంలో ఈ మత విశ్వాసాల రాజకీయం టిడిపికి మైలేజ్ తీసుకు రావడం గ్యారంటీ అని మేధావులు తెలుపుతున్నారు. అదే రీతిలో రాష్ట్రంలో వైసిపి పార్టీ కీలక ఓటు బ్యాంకుగా ఉండే దళితులపై కూడా వరుస దాడులు జరుగుతూ ఉన్న తరుణంలో….దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబు వైసీపీ ని కార్నర్ చేస్తూ రాజకీయాలు చేస్తే కచ్చితంగా దళిత ఓటు బ్యాంకు కూడా ఆపన్నహస్తంగా టిడిపికి మల్లే అవకాశముందని మేధావులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం టిడిపి మళ్లీ పుంజుకోవాలంటే ఇదే సరైన సమయమని అంటున్నారు.