2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వం స్థాపించగా, టిడిపి పార్టీ అధికారంలో ఉండి చాలా దారుణంగా ఓడిపోవడం ఆ పార్టీ క్యాడర్ ని ఎంతగానో కృంగదీసింది. ఒక్కసారిగా అధికారంలో ఉండి 23 మంది ఎమ్మెల్యేలకు పార్టీ పడిపోవటంతో, పార్టీతో చాలామంది నాయకుల పరిస్థితి అటూ, ఇటూ కాకుండా అయిపోయింది. దీంతో చంద్రబాబు కూడా ఒకింత కృంగిపోవడం జరగగా …. పార్టీని నెంబర్ 2 గా అచ్చెన్నాయుడు దగ్గరుండి ముందుకు నడిపించడం జరిగింది. ఈ దెబ్బతో పార్టీలో శాసనసభాపక్ష ఉపనేతగా అచ్చెన్నాయుడు ప్రమోషన్ పొందారు.
అదే రీతిలో చంద్రబాబు చాలావరకు స్వేచ్ఛ కల్పించడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కంటే ఎక్కువగా అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం పై చెలరేగిపోయారు. దీంతో ఆయన్ని నిలువరించడానికే వైఎస్ జగన్ సర్కార్ కేసుల్లో బుక్ చేయించిందని, జైలుకు వెళ్లడానికి కారణం అయింది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. పూర్తి విషయంలోకి వెళితే అచ్చెన్నాయుడు…చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈఎస్ఐ కుంభకోణంలో కొన్ని వందల కోట్లు అచ్చెన్నాయుడు సమక్షంలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ అధికారులు ఆరోపణ.
దీంతో అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రెండు నెలలు …. జైల్లో పెట్టడం జరిగింది. అనారోగ్యం కారణంగా జైల్లో ఉంటూనే మరోపక్క హాస్పిటల్ లో కూడా చివరలో చికిత్స తీసుకున్నారు. ఈ తరుణంలో ఇటీవల కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు ప్లస్ హాస్పిటల్ నుండి బయటకి వచ్చిన అచ్చెన్నాయుడు…. జగన్ సర్కార్ ని దెబ్బ తీయడానికి రెడీ అయినట్లు, త్వరలో ఉత్తరాంధ్రలో పాదయాత్ర తరహాలో… ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు టిడిపి పార్టీలో టాక్ నడుస్తోంది.