ఏపి టీడీపీ అధ్యక్షుడుగా సీనియర్ నేత, శాసనసభలో ఉప నేత కింజరపు అచ్చెన్నాయుడు నియమితులైయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఏపి, తెలంగాణ పార్టీ కమిటీలను పొలిట్ బ్యూరోతో పాటు సెంట్రల్ కమిటీని ప్రకటించారు.
27 మందితో పార్టీ సెంటర్ కమిటీ, 25 మందితో పొలిట్బ్యూరో, 31మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు ఆరుగురితో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వెల్లడించారు.
ఏపి విషయానికి వస్తే ఇప్పటి వరకూ అందరూ ఊహించినట్లే కళా వెంకట్రావు స్థానంలో అధ్యక్షుడుగా కింజరపు అచ్చెన్నాయుడును చంద్రబాబు నియమించారు. తెలంగాణలో అధ్యక్షుడు ఎల్ రమణను కొనసాగిస్తూనే ఆరుగురితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుల్లో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు. కావలి ప్రతిభా భారతి, గల్లా అరుణ కుమారి, డీకె సత్య ప్రభలతో పాటు కోట్ల సూర్యప్రకాశరెడ్డి, తెలంగాణకు చెందిన మెచ్చా నాగేశ్వరరావు, సిహెచ్ కాశీనాధ్ జాతీయ ఉపాధ్యక్షులుగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, వర్ల రామయ్య, ఎంపి కింజరపు రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీదా రవిచంద్ర, కొత్తకొట దయాకరరెడ్డి, బక్కని నరసింహులు, కంభంపాటి రామ్మోహన్ రావు నియమితులైయ్యారు. పొలిటికల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) టిడి జనార్థన్, జాతీయ అధికార ప్రతినిధులుగా గునపాటి దీపక్ రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మహమ్మద్ నజీర్, ప్రేమ్ కుమార్ జైన్, టి జోస్న, ఏన్ నర్శిరెడ్డి, కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా పరుచూరి అశోక్ బాబు, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా బచ్చుల అర్జునుడు, సభ్యులుగా పిఎస్ మునిరత్నం, గుంటుపల్లి నాగేశ్వరరావు, బంతు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నియమితులైయ్యారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాలయ అయ్యన్న పాత్రుడు, కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కాలవ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కె కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, ఎఎండీ ఫరూక్, గల్లా జయదేవ్, శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంథ్యారాణి, రావుల చంద్రశేఖరరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, ఎక్స్ అఫిషియో మెంబర్లుగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపి, తెలంగాణ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎల్ రమణలను నియమించారు.