ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన టీడీఎల్పీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసారు.
హైకోర్టు ఈ పిటీషన్ ను స్వీకరించింది. పిటీషన్ విషయమై రేపు విచారణ జరగనుంది. అనారోగ్యం కారణంగా గుంటూరు ఆసుపత్రిలో చేరిన అచ్చెన్నాయుడును 1వ తేదీన డిశ్చార్జ్ చేసారు. 1వ తేదీ సాయంత్రమే ఆయనని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బెయిలు వస్తోందన్న కారణంతోనే అచ్చెన్నాయుడును ఇబ్బంది పెట్టాలని జైలుకు తరలించారని టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈఎస్ఐ స్కాం విచారణ నిమిత్తమై అచ్చెన్నాయుడును తమ కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. గతంలో విచారణకు ఆయన సహకరించని నేపథ్యంలో మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.