చంద్రబాబు ఎవ్వరినైనా తనకు అనుకూలంగా మార్చుకోగలరు. తనకు పనికొచ్చే వారిని.. తను చెప్పినట్టు వినేవారినే తన దగ్గర ఉంచుకుంటారు చంద్రబాబు. అంతే కాదు.. తాను ఏది చెబితే అది వినేవాళ్లంటేనే ఆయనకు ఇష్టం. ఆయనకు ఎదురు తిరగడమంటే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడమే. అలా.. ఆయనకు ఎదురు చెప్పి టీడీపీ నుంచి ఎందరో నాయకులు బయటికి వెళ్లిపోయారు.
ఇక.. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ సర్కిల్ లో వినిపిస్తున్న ఒకే ఒక వార్త.. అచ్చెన్నాయుడికి ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించడం. ఈ వార్తే ప్రస్తుతం ఏపీలో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై తిరిగి వచ్చిన ఆయనకు చంద్రబాబు ఏపీ టీడీపీ పగ్గాల ఆశ చూపిస్తున్నారా? అనేది అంతుపట్టడం లేదు.
ప్రస్తుతం ఏపీకి టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. సడెన్ గా కళాను కాదని అచ్చెన్నాయుడికి ఎందుకు టీడీపీ అధ్యక్షుడి పదవి ఎందుకు ఇవ్వడం? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
పోనీ.. అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లకముందు ఆ పదవిని ఇస్తామన్న వార్తలు రాలేదు. కానీ.. అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి రాగానే చంద్రబాబుకు ఆయన మీద ఒక్కసారిగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది. గతంలోనూ వర్ల రామయ్యను రాజ్యసభ ఎంపీ పదవి కోసం బరిలో దింపి చివరకు ఆయన్ను బకరా చేసినట్టే.. అచ్చెన్నాయుడిని కూడా ఎటువంటి అధికారం లేని ఈ పదవి ఇచ్చి బకరా చేస్తారా? ఇదేనా చంద్రబాబు వ్యూహం.. అంటూ రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
అయితే.. అచ్చెన్నాయుడి సన్నిహితులు మాత్రం.. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని.. ఆ పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. దాని వల్ల ఒరిగేదేం ఉండదని.. ఆ పదవి కోసం ఆశపడి.. చంద్రబాబు వలలో చిక్కొద్దంటూ సలహాలు ఇస్తున్నారట.
ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఏదో కోరుకుంటున్న చంద్రబాబు.. అందుకే ఆ ప్రాంతం వ్యక్తి అచ్చెన్నాయుడికి ఈ పదవిని కట్టబెట్టి ఏదో సాధిద్దామనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంద్రులకు తానేదో న్యాయం చేస్తున్నట్టు చంద్రబాబు ఫీల్ అవుతన్నా.. అక్కడ జరిగేదేం లేదని.. చంద్రబాబు రాజకీయలు తెలియనిది ఎవరికి.. అంటూ పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?