ఏపీ మంత్రి జయరాంపై ఆరోపణల వర్షం కురుస్తోంది.కర్నూలు జిల్లాకు చెందిన ఈ మంత్రిని ఇప్పటికే మట్కా మంత్రి బెంజి మంత్రి అని పిలుస్తుండడ౦ తెలిసిందే.
టిడిపి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వరుసబెట్టి మీద మంత్రి జయరాం మీద ఆరోపణల బాణాలు సంధిస్తున్నారు.ఒక వ్యవహారంలో మంత్రి జయరాం కుమారుడుకు బెంజికారు బహుమతిగా వచ్చిందని అయ్యన్నపాత్రుడు ఆరోపించటం గుర్తుండే ఉంటుంది.తాజాగా మళ్లీ అదే అయ్యన్నపాత్రుడు జయరాం మీద భూ కబ్జా ఆరోపణలు చేశారు.కర్నూలు జిల్లాలో ఏపీ మంత్రి జయరాం నాలుగు వందల ఎకరాలను తన కుటుంబ సభ్యులు బినామీల పేరుతో సొంత దారుల నుంచి బెదిరించి లాక్కున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నించారని చెప్పడమే కాకుండా ఇందుకు సాక్ష్యాధారాలుగా ఆయన కొన్ని పత్రాలు బయటపెట్టారు.మంత్రి అయ్యాక జయరాం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అయ్యన్న ఆరోపించారు. ఆ భూములన్నీ ఎక్కువగా ప్లాటినా అనే కంపెనీకి సంబంధించినవి అన్నారు. మరికొన్ని రైతులవని పత్రాలు చూపించారు. ఇద్దరు సోదరుల భార్యలపైన రెండు వందల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. మిగతావి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని అయ్యన్న రిజిస్ట్రేషన్ పత్రాలను మీడియాకు ముందు చూపించి విమర్శించారు.కొన్ని భూములను ప్లాటినా అనే కంపెనీ నుంచి కొనుగోలు చేశారని అయ్యన్న ఆరోపించారు. సేల్ డీడ్ లో చిత్రమైన విషయాలు ఉన్నాయని వివరించారు. నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ జరగలేదన్నారు.
రెండు లక్షలకు మించి నగదు వ్యవహారం జరగకూడదని.. రూ.52 లక్షల రూపాయలు సేల్ డీడ్ ఎలా నగదుగా మార్చారని అయ్యన్న ప్రశ్నించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవడానికి జయరామ్పై తను చేస్తున్న ఆరోపణల మీద సమగ్ర విచారణ జరిపించాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సహచరులలో ఈ జయరాం మీదనే ఎక్కువ ఆరోపణలు వస్తుండటం గమనార్హం.తొలిసారి మంత్రి కాగానే జయరామ్ చెలరేగిపోతున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి జయరాం విషయంలో సీఎం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి