అమరావతి, జనవరి 23: జనసేన-తెలుగుదేశం పార్టీ కలిసే అవకాశాల మెండుగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాల గురించి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం సమంజంసం కాదని ఆయన అన్నారు.
పొత్తుల గురించి మీడియాతో టిజి మాట్లాడిన కొద్ది సేపటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాడేరు సభలో ఆయన్ని కడిగిపారేశారు.
ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. టిజి తీరుపై మండిపడ్డారు. ఇటువంటి ప్రకటనలు చేసి పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేయవద్దని ఆయన చెప్పారు. పార్టీ విధివిధానాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.