ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ విభజన జరిగిన తర్వాత దానిని అలా చూసిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడుని మించిన వారు మరొకరు ఉండరు అని చాలా మంది సీనియర్లు చెబుతుంటారు. ముఖ్యంగా 2019 ఎన్నికలలో ఓడిపోయినా గాని చంద్రబాబు అతి స్వల్ప మెజారిటీతో ప్రతిపక్షంలో ఉన్న జగన్ అనుకుంటున్న ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు చాలా వరకు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.
మూడు రాజధానులు విషయంలో గాని ఇంగ్లీష్ మీడియం విషయంలో గానీ అదే విధంగా ఇళ్ల పట్టాలు విషయంలో గానీ చంద్రబాబు వేసిన రాజకీయ ఎత్తుగడలకు జగన్ పార్టీ చాలావరకు తోక ముడిచి నట్లయింది అని పరిశీలకుల మాట. ఒక నిర్ణయాల విషయంలో మాత్రమే కాకుండా ఇటీవల చంద్రబాబు వైసీపీ నేతలకు దీటుగా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉన్నారు. విషయంలోకి వెళితే ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఉద్దేశించి తాటతీస్తా తోలు తీస్తా అంటూ ఓ రేంజ్ లో చంద్రబాబు రెచ్చిపోయారు.
గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థానం ఉన్న మాదిరి గానే ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు అదే తరహాలో రాజకీయాలు చేస్తూ ఉండటంతో…. తాజాగా ఈ యొక్క వైసిపి మంత్రుల పై చంద్రబాబు వేసిన కామెంట్ ను ఉద్దేశించి టిడిపి ఫ్యాన్స్ బాబు లకే బాబు చంద్రబాబు అని కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాలు చేయాలంటే బలం అవసరం లేదు బుర్ర ఉంటే సరిపోతుంది అందుకే చంద్రబాబు ఈజ్ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు చేతిలో బలం లేకపోయినా కానీ 151 మంది ఎమ్మెల్యేల కలిగిన జగన్ ప్రభుత్వం తలపెడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం మామూలు విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.