Bala Krishna :రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు చాలామంది ప్రముఖులు సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో టిడిపి పార్టీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలయ్య బాబు హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చైర్మన్ హోదాలో ఘనంగా జరిపించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బాలయ్యబాబు అనంతరం మాట్లాడుతూ.. ఇండియన్ కరోనా వ్యాక్సిన్ కోవాక్స్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఏమన్నారు అంటే… మన దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ఫలితాలు అద్భుతమని పేర్కొన్నారు. అంతేకాకుండా మనదేశ వ్యాక్సిన్ ఇతర దేశాలలోని ప్రజలకు ఉపయోగపడటం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా అద్భుతంగా జరుగుతుంది అని కొనియాడారు. ఇదే రీతిలో మహమ్మారి కరోనా వైరస్ వల్ల మృతి చెందిన వారికి బాలయ్యబాబు ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. అంతే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధితులకు పండ్లు అందజేశారు. మరో పక్క మెగాస్టార్ చిరంజీవి కూడా తన బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, నాగబాబు, అల్లు అరవింద్ పాల్గొన్నారు. మెగా ఫ్యాన్స్ కొంత మంది రక్తదానం చేయడం తో వారిని పరామర్శించారు రామ్ చరణ్. ఏదిఏమైనా 72వ రిపబ్లిక్ డే నాడు బాలయ్యబాబు కరోనా వ్యాక్సిన్ ని ఉద్దేశించి కీలక కామెంట్లు చేయటం మాత్రమే కాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా చేస్తున్నట్లు పొగడటం అనేది సంచలనమే అని చెప్పవచ్చు.