సినిమా రంగంలో రాజకీయరంగంలో విజయవంతం గా రాణిస్తున్న నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు ఇటీవల 60వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో బాలయ్య జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఈ తరుణంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో చాలా మంది రోగులకు సాయం చేయడం జరిగింది.
ఇదిలా ఉండగా తనని ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం బాలయ్య బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో భారీ హెల్ప్ చేయడానికి బాలయ్య బాబు ముందుకు వచ్చారు. వైరస్ విషయంలో తాజాగా తన పెద్ద మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలోని కరోనా వైరస్ హాస్పిటల్ కి 55 లక్షల విలువైన మెడిసిన్, పిపియి కిట్లు, మాస్కులు ఇతర సామాగ్రిని విరాళంగా అందించడం జరిగింది.
ఇప్పటికే బాలయ్య బాబు కరోనా విషయంలో సినిమా ఇండస్ట్రీకి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ స్థాయిలో వివరాలతో పాటు అనేక రకాలుగా సహాయాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన కార్మికులకు సామాన్యులకు తన బసవతారకం హాస్పిటల్ తరుపున రకరకాల మెడిసిన్ లు అందివటం జరిగింది. ఈ రీతిగా బాలయ్యబాబు కరోనా విషయంలో తన వంతుగా ఎప్పటికప్పుడు సమాజానికి ఏదో రీతిలో మేలు చేస్తూనే తన మంచి మనసును చాటుకుంటున్నారు.