BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పై అమిత్ షా తో చర్చించనున్నట్లు సమాచారం. అదే రీతిలో మరికొద్ది నెలల్లో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్న తీరును కూడా అమిత్ షా కు వివరించనునట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే కేవలం మర్యాదపూర్వకంగానే అమిత్ షా తో బేటీ కాబోతున్నట్లు మరోపక్క బండి సంజయ్ తెలిపారు.
ఏది ఏమైనా ఒకపక్క పాదయాత్ర మరోపక్క హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణలో ప్రారంభం కానున్న ఈ క్రమంలో.. అమిత్ షా తో బండి సంజయ్, ఈటల రాజేందర్ బేటీ తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలలో త్వరలో హుజురాబాద్ ఎన్నికలు మరియు బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మార్చే రీతిలో ఉంటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read More: BJP: బీజేపీ జాతీయ కమిటీలో భారీ మార్పులకు కసరత్తు..! అయిదు రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యం..!!
ఇదిలా ఉంటే మరో పక్క టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఈటల రాజేందర్ ని టార్గెట్ చేసుకుని భారీగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నికలు రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలను బాగానే ప్రభావితం చేసే విధంగా తెలంగాణలో పొలిటికల్ హీట్ కనబడుతుంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన విధంగా ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి బిజెపి రెడీ అవుతుంది.