NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్, ఈటల రాజేందర్ అరెస్టు .. ఎందుకంటే..?

హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ దీక్షకు దిగారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ ల లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు. గన్ పార్క్ దగ్గరకు రాగానే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బండి సంజయ్ సడెన్ గా దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.

Bandi Sanjay Etela Rajender Arrest

 

బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్, కార్యకర్తలు దీక్షకు కూర్చున్నారు. ఇక్కడ దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయినా తాను దీక్ష చేయడం ఖాయమనీ, అరెస్టు చేస్తే చేసుకోవచ్చని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఎవ్వరూ అరెస్టులకు భయపడరని రాజేందర్ అన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ సహ పలువురుని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను బీజేపీ నేతలు ప్రతిఘటించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ లను అరెస్టు చేసి తీసుకువెళుతున్న పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అసెంబ్లీ ముందు రోడుపై బీజేపీ మహిళా కార్యకర్తలు భైఠాయించారు.

మరో పక్క వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హౌస్ అరెస్టు చేశారు. ఆందోళనల నేపథ్యంల టీఎస్పీఎస్సీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఎన్ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి బయలుదేరగా, గాంధీ భవన్ గేట్లు మూసి బయటకు రాకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.   అయినా పలువురు కార్యకర్తలు గేట్లు దూకి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విపక్ష పార్టీలు ఈ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి.య అలాగే ఆందోళనలు ఉధృతం చేశాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరో పక్క టీఎస్పీపీఎస్సీ గ్రుప్ 1 ప్రిలిమ్స్ ను కూడా రద్దు చేసింది. ఇప్పటికే ఏఈ పరీక్షతో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్స్ పేపర్లు రద్దు చేసింది. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షను కూడా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా, విపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk