(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఒ అభిమాని ఆత్మహత్యాయత్నంకు పాల్పడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ అరెస్ట్ ను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడెంకు చెందిన బండి సంజయ్ అభిమాని నేడు పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. మంటల్లో అతని శరీరం కాలుతున్న “బీజేపీ జిందాబాద్, బండి సంజయ్ అంటే నాకు ప్రాణం” అంటూ అరిచాడు. వెంటనే అక్కడ ఉన్నవాళ్లు, పోలీసులు బకెట్లతో నీళ్లు పోసి మంటలను ఆర్పారు. అతనికి 40శాతంకు పైగా కాలిన గాయాలు అయ్యాయి. ఈ సందర్బంగా శ్రీనివాస్.. మాట్లాడుతూ బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన రోజున తాను లేనని, అక్రమంగా బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని, ఆయన కోసం ఏమైనా చేస్తానని పేర్కొన్నాడు. బీజేపీ ని కేసీఆర్ ఏమి చేయలేడని అన్నాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.