Breaking: యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తన పాద యాత్ర వాయిదా వేసుకోవడం జరిగింది. గతంలో అనేక మార్లు పాదయాత్ర మొదలు పెట్టాలని అనుకున్న వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. హైదరాబాదు నగరం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి టెంపుల్ నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. హైదరాబాద్ టూ హుజురాబాద్ కి పాదయాత్ర ప్లాన్ చేసి ఓటర్లను ఆకర్షించడానికి బండి సంజయ్ పూనుకున్నారు.
కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తలతో ఈ కార్యక్రమం నిర్వహించాలని ముందుగానే ఆయా జిల్లాలకు చెందిన కార్యకర్తలతో ప్రత్యేకంగా పాదయాత్ర గురించి బండి సంజయ్ భేటీ కావడం కూడా జరిగింది. అయితే కరెక్ట్ గా పాదయాత్ర స్టార్ట్ చేయాలని అనుకున్న టైంలో యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణించడంతో కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకున్నారు. పార్టీపరంగా ఆరు రోజుల పాటు సంతాపదినాలు చేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటన చేశారు. వాస్తవానికి బండి సంజయ్ పాదయాత్ర ఆగస్టు 9వ తారీఖున స్టార్ట్ కావల్సి ఉండగా..వాయిదా పడటం జరిగింది. మళ్లీ ఈ నెల 30వ తారీఖున పాదయాత్ర స్టార్ట్ కానున్నట్లు సమాచారం.