Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ గడిల పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, చాలామంది ఉద్యమకారులు తెరమరుగయ్యారు అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది.. ఫామ్ హౌస్ లో కూర్చోడానికా ..? వందలాది మంది వీరులు ప్రత్యేక తెలంగాణ కోసం ఎందుకోసం ప్రాణాలు అర్పించారు అని ప్రశ్నించారు.
అదే రీతిలో టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు వారి అవినీతి చిట్టా తీస్తున్నామని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉంటుందని, ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటే దగ్గరికి తీసుకుంటారని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు గా వ్యవహరిస్తున్న అవినీతి బాగోతం మొత్తం బీజేపి అధికారంలోకి వచ్చాక బయట పెడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం గ్యారంటీ అన్నట్లు తెలిపారు.
Read More: Bandi Sanjay: కెసిఆర్ జైలుకుపోవడం పక్కా!బిజెపి సంజయ్ కీలక వ్యాఖ్యలు!
టిఆర్ఎస్ పార్టీ విధి విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విసిగిపోయారని, కచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అవినీతి మొత్తం బయట పెడతాము అని .. ప్రస్తుతం కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదే రీతిలో బిజెపి కౌంటర్ ఉంటుంది అన్నట్టు బండి సంజయ్ సీరియస్ కామెంట్లు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎటువంటి అభివృద్ధి జరగలేదని .. నిజాం పరిపాలన తపించేలా కేసీఆర్ పరిపాలన ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.