ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఉన్న రాజకీయ నాయకులకు సినిమా హీరోలకు ధీటుగా క్రేజ్ ఉన్న నాయకుడు వైయస్ జగన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా జగన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల తమిళనాడులో స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు వేడుకలు టైంలో విజయ అభిమానులు వైయస్ జగన్ కటౌట్ పెట్టి….. ఈ రకంగా తమిళ రాజకీయాలు చేయాలని అని జగన్ ని ఆదర్శంగా తీసుకోవాలని బ్యానర్ల మీద బ్యానర్లు కట్టడం జరిగింది.
ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో కీలక రాజకీయ నేతగా రాణించక ముందే బెంగళూరులో వైయస్ జగన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చలామణి అవుతున్న తరుణంలో వైఎస్ జగన్ బెంగళూరులో బిజినెస్ చేస్తూ రాణించడం జరిగింది. దీంతో తండ్రి చనిపోవడంతో పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన వైయస్ జగన్ త్వరలో బెంగళూరు నగరంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో…. బెంగళూరులో జగన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారట.
పూర్తి విషయంలోకి వెళితే జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి ప్రపంచంలోనే టాప్ ఫైవ్ బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ప్యారిస్ ఇన్సిడ్ స్కూల్లో సీటు సంపాదించడం జరిగింది. దీంతో హర్ష రెడ్డి ని ప్యారిస్ పంపించడం కోసం బెంగళూరుకి జగన్ వెళ్లడంతో దాదాపు అక్కడ రెండు రోజులు ఉండే అవకాశం ఉండటంతో…. భారీ ఏర్పాట్లు బెంగళూరు జగన్ ఫ్యాన్స్ చేసి నానా హడావిడి సృష్టించారు.
చాలా కాలం తర్వాత తమ అభిమాన నాయకుడు తిరిగి సిటీకి రావడంతో బెంగళూరులో ఉన్న చాలా మంది ప్రముఖులు జగన్ తో బేటీ అవటానికి ఇప్పటికే అపాయింట్మెంట్లు తీసుకున్నట్లు సమాచారం. తన కూతురిని ఫ్లైట్ ఎక్కించిన అనంతరం బెంగళూరులో చాలా మంది ప్రముఖులను జగన్ ఈ సందర్భంగా కలవనున్నట్లు, ఆతర్వాత 27వ తేదీన తాడేపల్లికి జగన్ చేరుకొనున్నట్లు సమాచారం.