ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది రైతు ఉద్యమం. ఇందులో రైతులు ఉన్నారు.. నేతల ముసుగులో వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న (రైతులు) నేతలూ ఉన్నారనేది ఓ వాదన. రైతలు ఉద్యమానికి తెర వెనుక నుంచి మద్ధతిస్తున్న నేతల వ్యాపారాలు ఏమున్నాయి? వ్యవసాయంతో వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న నాయకులు దేశంలో ఎంతమంది ఉన్నారు. వారు కూడబెడుతున్న ఆస్తులు, కడుతున్న పన్నులు ఎంత..? అనేవి చూస్తే గమ్మత్తనిపిస్తాయి. ఇవన్నీ వేలు, లక్షల కోట్లు ఉంటాయో చెప్పడం కష్టమే..! వ్యవసాయ చట్టాలు వస్తే ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. అందుకే రైతుల వెనకుండి కొందరు బడా నేతలు ఈ ఉద్యమం చేయిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఇవి కేవలం అనుమానాలు మాత్రమే. వీటిని వాస్తవమని నిర్ధారించలేమూ.. అవాస్తవమని కొట్టిపారేయలేము.
లెక్కలు బయటకొస్తాయనే..
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకి నచ్చటం లేదు.. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకూ నచ్చటం లేదు. రైతులదో సమస్య అంటే.. నాయకులదో సమస్యగా తెలుస్తోంది. దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి కానీ.. వ్యవసాయం మీద వచ్చే రూపాయికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం రైతు తన పంటను మండీల్లోనే కాదు.. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ పంటను కొనేవారికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. పాన్ నెంబర్ ఉండాలి టిన్ నెంబర్ ఉండాలి. మొదటి పంట అమ్మకానికి GST, Income Tax మినహాయింపు ఉంటుంది. రెండో పంట అమ్మకాల నుంచి GST, Income Tax కట్టాల్సిందే. అంటే.. రైతు ఎంత పంట పండించిందీ, ఎంత మార్కెట్ లోకి వచ్చిందీ అనేది ప్రభుత్వం లెక్కల్లోకి వస్తుంది.
కేంద్రం మంచి పనే చేస్తోందా..!
అంటే.. బడా.. బడా నేతలు వ్యవసాయం మీద కోట్లు ఎలా సంపాదిస్తున్నారో ప్రభుత్వం లెక్కల్లోకి వస్తుంది. దీనిని బట్టి వీరు వంకాయలు, కొత్తిమీర కట్టలు పండించి.. కోట్లు సంపాదించారా.. లేక అడ్డదారుల్లో సంపాదించిన సొమ్మును వైట్ చేస్తున్నారో ప్రభుత్వాలకీ, ప్రజలకు అర్ధమైపోతుంది. అందుకే.. నేతలంతా వ్యవసాయం కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నది. ఇదే ఇక్కడ లాజిక్కు. వ్యవసాయం మీద నేతలకు కోట్లు ఎందుకు వస్తున్నాయి.. నిజమైన రైతుకు నష్టం ఎందుకు వస్తుంది. ఇక్కడే ఉంది తిరకాసు..! తమ సంపాదనకు నేతలు వెతుక్కున్న.. ఉన్న ఏకైక దారి వ్యవసాయం. దీనికి లెక్కలు చెప్తే ఉన్న ఒక్క దారీ మూసుకుపోయినట్టే. అందుకే.. రైతులు ఆందోళనలు ఒకందుకైతే.. వారికి మద్దతు ఇస్తూ పనిలోపనిగా తమ మనుగడనూ కాపాడుకోవచ్చనేది వీరి ఆలోచనగా చెప్పాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?