ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర పొందటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఉత్తరాంధ్రలో మరియు రాయలసీమలో జగన్ తీసుకున్న నిర్ణయానికి జై జైలు కొడుతున్నారు. మరోపక్క కోస్తా వాసులు మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్న విశాఖ తమ ప్రాంతం నుండి చాలా దూరంగా ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కాని రాయలసీమ వాసులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. కర్నూల్ న్యాయ రాజధాని కావటంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కచ్చితంగా రాబోయే రోజుల్లో కర్నూలు దగ్గరగా ఉన్న తిరుపతి, అనంతపురం అభివృద్ధి చెందిన నగరాలు కావడంతో మెట్రో సిటీ లుగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా అమరావతి ప్రాంతం మరియు టిడిపి పార్టీ నాయకులు తప్ప రాష్ట్రవ్యాప్తంగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి పాజిటివ్ స్పందన బాగానే ఉంది. అభివృద్ధి ఒక చోట మాత్రమే కాకుండా అంతటా జరగాలని జగన్ తలంచిన ఈ నిర్ణయానికి చట్ట భద్రత రావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఈ నిర్ణయం వల్ల కర్నూలు మరియు విశాఖపట్టణం చుట్టుప్రక్కల ప్రాంతాల అభివృద్ధి చెందటంతో పాటు యువతకు భారీస్థాయిలో ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయని ఇందులో వివాదాలకు పోవాల్సిన అవసరం లేదని, మూడు రాజధానులు వల్ల ఏపీకి చాలావరకు బెనిఫిట్ అంటూ ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన పట్టణంగా విశాఖపట్నం ఎప్పటినుండో ఉన్న అది ఐసోలేషన్ లో అన్నట్టుగా… ఓ మూలన మొన్నటి వరకు ఉంది. అయితే జగన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడంతో దేశంలో ప్రముఖ నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు తరహాలో విశాఖపట్టణం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.