ప్రస్తుతం దేశంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన టిడిపి ఎంపీలు కేసినేని నాని, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అట. ప్రస్తుతం ఈ విషయం టిడిపి పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు…. మిగతా ఇద్దరు ఎంపీలతో చాలా దూరం ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గతంలో టిడిపి లో కీలకంగా ఉండి బీజేపీ లోకి వెళ్లిన సుజనాచౌదరి తో ఉంటున్నారట.
దీంతో గల్లా జయదేవ్ బిజెపిలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఈ విషయం అధినాయకుడు చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ముగ్గురితో ఫోన్ చేసి మాట్లాడినట్లు అయినా గాని ఎవరికి వారే అన్నట్టుగా వీరు వ్యవహరిస్తున్నట్లు టిడిపి పార్టీలో టాక్ వినపడుతోంది. దీంతో వైసీపీ , బీజేపీ ఎంపీలు టిడిపి ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
మరోపక్క కచ్చితంగా ఈ ముగ్గురిలో ఒకరు మాత్రం బీజేపీ లోకి వెళ్ళిపోవటం గ్యారెంటీ అనే టాక్ వస్తోంది. ఈ సమావేశాలు చివరి లోపు ఈ విషయంపై క్లారిటీ రావడం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు. ఇదే గనుక జరిగితే చంద్రబాబు కి పార్లమెంటు నుండి ఇది అతిపెద్ద బిగ్ బ్యాడ్ న్యూస్ అని మేధావులు అంటున్నారు.