Big Breaking: బెంగాల్ ఎన్నికల్లో ఓడిన బీజేపీ ఇప్పుడు తమ పవర్ చూపిస్తుంది.. మమతపై తమ ప్రతాపం చూపించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.. కొత్తగా కొలువుదీరిన క్యాబినెట్ లో మంత్రులను అరెస్టు చేయడం.. మమతని కూడా ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేయాలనే పన్నాగాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం మమతా క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఏ మాజీ మేయర్ లను సీబీఐ అధికారులు అదుపుకు తీసుకున్నారు. వారిని అరెస్టు చూపుతారని అంటున్నారు.. తదుపరి మమతకు కూడా నోటీసులిచ్చే అవకాశాలున్నట్టు బీజేపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి..
Big Breaking: శారదా కుంభకోణంలో తీగ లాగుతున్నారు..!
బెంగాల్ లో శారదా చిట్స్, రోజ్ వాలీ చిట్స్ అని రెండు కుంభకోణాలు సీబీఐ విచారణ దశలో ఉన్నాయి. ఈ రెండింటిలో మమతాకు ప్రమేయం ఉంది అని బీజేపీ మొదటి నుండి ఆరోపణలు చేస్తుంది. రాజకీయంగా ఆమెను దెబ్బతీయడానికి ఈ రెండు కుంభకోణాలు బూచిగా చూపించిన బీజేపీకి.. ఆ ప్రయోజనాలు అందలేదు. అక్కడి ప్రజలు నమ్మలేదు. దీంతో సీబీఐ తమ శోధనని వేగవంతం చేసింది. సరదా చిట్స్ కేసులో వేగంగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మంత్రులు ఫిర్హాద్ హకీమ్, శుభ్రత ముఖర్జీలతో పాటూ తృణమూల్ సీనియర్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మేయర్ సోమం ఛటర్జీ లను ఈరోజు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోల్ కట లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?