సీనియర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న కరాటే కళ్యాణి కొన్ని వందల సినిమాల్లో నటిస్తూ ఉంది. ముఖ్యం గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన మిరపకాయ్’లో సినిమాలో “అబ్బా పిండేసారు” అనే డైలాగ్ తో కళ్యాణి బాగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా ఇటీవల సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఈమె రెండో వారంలో ఎలిమినేట్ అవ్వడం తెలిసిందే. ముక్కుసూటిగా గేమ్ ఆడటం వల్లే తాను ఎలిమినేట్ అయినట్లు… మాస్కు పెట్టుకొని ఆడే ఆట తనకి రాదు అంటూ కళ్యాణి బయట ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు బలమైన నాయకురాలిగా ఎదగాలని కళ్యాణి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. ఈ నేపథ్యంలో కళ్యాణి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. ఉన్నాయని బిజెపిలో కళ్యాణి చేరడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడమే అని టాక్. దీంతో త్వరలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకుని బీజేపీలో చేరాలని కరాటే కళ్యాణి అనుకుంటున్నట్లు టాక్.
ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో కొంతమంది నిజంగా పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉంటే జనసేన పార్టీలో చేరవచ్చు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా త్వరలో కరాటే కళ్యాణి బీజేపీలో చేరడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతోంది. మరి కరాటే కళ్యాణి ఏపీలో పోటీ చేస్తారా లేక పోతే తెలంగాణలో పోటీ చేస్తారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇటీవలే వైయస్ జగన్ తిరుమల తిరుపతి పర్యటన పై సోషల్ మీడియా సాక్షిగా కరాటే కళ్యాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ని త్వరలో కరాటే కళ్యాణి కలవటం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఈ వార్త సంచలనంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?