Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారం మొదటి నుండి అధికార పార్టీ వైసీపీ కి తలనొప్పిగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అన్న తరుణం నుండి స్టార్ట్ అయిన ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయిన నిమ్మగడ్డ న్యాయస్థానాల్లో పోరాడి మళ్ళీ తన పదవిని కాపాడుకోవటం అందరికీ తెలిసిందే. అనేకమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించిన నిమ్మగడ్డ, తాజాగా మరికొద్ది రోజుల్లో పదవి నుండి దిగిపోతున్న క్రమంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. మేటర్ లోకి వెళ్తే నిమ్మగడ్డ హైకోర్టులో కేస్ ఫైల్ చేశారు.
తాను గవర్నర్ తో జరుపుతున్న మంతనాలు బయటకు వస్తున్నాయి అని, అది ఎలా సాధ్యం అవుతుందో తెలియడం లేదని, సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన లెటర్లు కూడా ప్రత్యక్షం అవుతున్నాయి అని పేర్కొన్నారు. ఆ లెటర్ లో ఉన్న విషయాలనే మంత్రులు ప్రస్తావిస్తారని, దీనిపై సిబిఐ చేత విచారణ చేయించాలి అంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిమ్మగడ్డ వేసిన పిటిషన్ లో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ని అదేవిధంగా సిఎస్ మరియు మంత్రులను ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టులో నిమ్మగడ్డ వేసిన పిటిషన్ నేడే విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.