స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో న్యాయస్థానాల తలపడుతున్న వైయస్ జగన్ కి తాజాగా ఈడీ కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. మేటర్ లోకి వెళ్తే ఈ నెల 11 వ తారీకున విచారణకు హాజరు కావాలని ఈడీ కోర్టు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన నేపథ్యంలో జగన్ కి అదేవిధంగా విజయసాయి రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టు నుండి ఈడీ కోర్టుకు బదిలీ అవ్వటం అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఈడీ కోర్టు విచారణకు హాజరవ్వాలని జగన్ అండ్ కో కి ఆదేశాలు ఇవ్వటం ఏపీ రాజకీయవర్గాలలో సంచలనం అయ్యింది. ఇదిలా ఉంటే తన కేసులకు సంబంధించి విచారణ సమయంలో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి జగన్ హాజరు కాలేనని గతంలో సిబిఐ కోర్టుకు తెలపటం న్యాయస్థానం కూడా ఓకే చెప్పడం అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఈడీ కోర్టు సమన్లు జారీ విషయంలో సీఎం జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.