బీహార్ ఎన్నికల ఫలితాల్లో బాహుబలి తరహా ఫైట్ నడుస్తోంది. ఎన్డిఏ కూటమి ఒక పక్క, మహా ఘాట్ బంధన్ కూటమి మరో పక్క హోరాహోరీగా తలపడుతున్నాయి. 243 సీట్ల బీహార్ అసెంబ్లీ లో 122 మేజిక్ మార్కు. దీన్ని సాధించి పీఠం దక్కించుకునేందుకు నువ్వా నేనా అన్నట్లు ఆధిక్యం సాగుతోంది. సాధారణంగా ఉదయం 10 గంటలకే ట్రేండింగ్ తెలిసిపోతుంది. ఆధిక్యం బట్టి ఏ పార్టీ పరిస్థితి ఏంటో ఓ అంచనాకు రావొచ్చు. బీహార్ ఫలితాల్లో ఈ సరి దీన్ని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 11 గంటలు అయినా ఫలితాల్లో స్పష్టత, ట్రేండింగ్ అంతుబట్టడం లేదు. దింతో రాజకీయ పండితులు సైతం ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.
లాలూ దీపం వెలిగింది.. ఓట్లు పెరిగాయి
దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ ఆధ్వర్యంలో సాగుతున్న రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ బీహార్లో పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కడపటి వార్తలు అందేసరికి ఆర్జెడి 66 స్థానాల్లో ముందంజలో ఉంది. కూటమిలో ఉన్న కాంగ్రెస్ సైతం 26 స్థానాల్లో వీరి మిత్రపక్షాలుగా ఉన్న వామపక్ష పార్టీలు 16 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఆర్జెడి వోటింగ్ శాతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే కూటమికి నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ రాఘవపుర నియోజకవర్గంలో వెనుకబడినట్లు తెలుస్తోంది.
ఎన్డీఏ ఆధిక్యంలోకి…
ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతా దళ్ (యునైటెడ్) తో కలిసి బరిలోకి దిగిన భాజాపా ఆధిక్యం దిశగా సాగుతుంది. 122 సీట్ల మేజిక్ మార్కు దాటి 130 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇదే ట్రేండింగ్ సాగితే ఎన్డీయే మరోసారి బీహార్లో సత్తా చాటి కొత్త శక్తీ పుంజుకునే అవకాశం ఉంది. నితీష్ ఇప్పటికే ఇవేతన చివరి ఎన్నికలుగా ప్రకటించిన నేపథ్యంలో బీహార్ లో వెనుకబడిన భాజాపా కు అక్కడ పాగా వేసేందుకు మరో అవకాశం చిక్కినట్లే. అయితే ప్రస్తుత ట్రేండింగ్ బట్టి ఏ కూటమి విజేత అనేది చెప్పలేం. మరి కొద్దీ గంటల్లో దీనిపై స్పష్టత వస్తుంది.