Bihar : దేశంలో చాలా చోట్ల పోలీసులపై జరిగిన అనేక దాడులను చూశాం. నక్సల్స్, మావోయిస్టులు కాకుండా ప్రజాప్రతినిధులే మార్షల్స్ ని చితకబాదడం ఎన్నో చోట్ల తిలకించాం. అధికారం చేతిలో ఉంటే పవర్ ఉన్న పోలీసైనా అణిగిమణిగి ఉండాల్సిందే కదా అని ఊరుకున్నాం. అయితే బీహార్ మాత్రం ప్రత్యేకం. అయితే అప్పుడు పోలీసులపై పూర్తి సానుభూతి వ్యక్రపరిచాం కానీ ఇప్పుడు బీహార్లో పరిస్థితి తారుమారు అయింది.
వివరాల్లోకి వెళితే… రౌడీల రాజ్యం గా పేరొందిన బీహార్ రాష్ట్రంలో ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలను పోలీసులు రక్తం వచ్చేలా కొట్టారు. బీహార్ అసెంబ్లీ కొద్దిసేపటి పాటు రణరంగాన్ని తలపించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులు సభలోనే దాడి చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు… చట్టాలని సవరించగల, వీలైతే మార్చగల శక్తి ఉన్న ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా పోలీసులు రక్తం వచ్చేలాగా కొట్టారు.
అసెంబ్లీలో బిల్లులు పెట్టారు. అందులో పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించే బిల్లును విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఇదే జరిగితే అధికార పార్టీ, పోలీసులు కుమ్మక్కై ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రతిపక్షాలను తొక్కివేస్తారని ఆరోపించారు. మాటా మాటా పెరగడంతో సభలోనే ప్రతిపక్షం ఆందోళనకు దిగింది. పలుమార్లు సభకు అడ్డు రావడంతో స్పీకర్ పోలీసులకు కావాల్సిన ఆదేశాలు ఇచ్చారు.
దీంతో పోలీసులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేలందరినీ విచక్షణారహితంగా కొడుతూ బయటకు తోసేశారు. ఇలా ప్రజాప్రతినిధులపై అసెంబ్లీలో జరిగిన దాడిని ఖండించిన యావత్తు దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు. మామూలు సామాన్యుల పైనే దాడి చేయడం తప్పు అయితే ఇలా ప్రజాప్రతినిధులను రక్తాలు వచ్చేలా కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక అధికార జేడీయూపై విపక్షాలు ఆర్జేడీ నిప్పులు చెరిగారు. అక్కడికక్కడే పలు పార్టీలు బంద్ కి కూడా పిలుపునిచ్చాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?