బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే అక్కడ అధికార పార్టీ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) పార్టీకి చెందిన పరిశ్రమల శాఖ మంత్రి శ్యామ్ రాజాక్ ను ఆ పార్టీ హైకమాండ్ పార్టీ నుండి వేటేసింది. పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నారని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ మాట్లాడుతూ అందువల్లే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో శ్యామ్ రాజాక్ నూ మంత్రి పదవి నుంచి మాత్రమే కాక పార్టీ నుంచి కూడా బహిష్కరించినట్లు స్పష్టం చేశారు. దీంతో తన పై వేటు వేయడంతో జెడియు పార్టీ పై శ్యామ్ రాజాక్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏ టైంలో రాజకీయాల్లో అడుగు పెట్టిన సమయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి కీలక అనుచరుడిగా ఉండటంతో… మరోపక్క ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తిరిగి ఆర్జెడి పార్టీలో చేరడానికి శ్యామ్ రాజాక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బీహార్ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.
మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. గతంలో పార్టీకి కీలకంగా ప్రచారం చేసిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కుమార్ ని పార్టీ నుండి సస్పెండ్ చేసి అందరికి షాక్ ఇవ్వగా, తాజాగా సొంత పార్టీ మంత్రిని… పదవి నుండి అదే రీతిలో పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో బీహార్ రాజకీయాలు ఉన్న కొద్ది రసవత్తరంగా మారుతున్నాయి.