ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు నుండి బీజేపీ స్ట్రాటజీ ప్రతిపక్షంగా టిడిపి కంటే ముందు ఉండాలి అన్న రీతిలో రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ విధంగానే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలావరకూ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వంపై టీడీపీ కంటే చాలా పోరాటాలలో బీజేపీ పార్టీ ముందుండటం జరిగింది. ఇప్పుడు కూడా టీడీపీతో నువ్వానేనా అన్నట్టుగా అనేక విషయాలలో పోటీ పడుతూ ఉంది.
మరోపక్క ఏపీ బీజేపీ పార్టీ నేతలు టీడీపీ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ తమ పార్టీలో చేర్చుకోవడానికి రక రకాల వ్యూహాలు వేస్తున్నారు. ఈ క్రమంలో టిడిపిలో బలంగా ఉండే నాయకులకు సీనియర్లకు ఎవరి పైన అయితే కేసులు వంటివి ఉన్నాయో వారిని టార్గెట్ చేస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్. వాళ్లు గనక బీజేపీలో వస్తే ఖచ్చితంగా కేసులు కొట్టివేయడం గ్యారెంటీ అని భరోసా ఏపీ బీజేపీ నేతలు ఇస్తున్నట్లు.. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నాయకులు బిజెపి లోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జెసి బ్రదర్స్.. బీజేపీ లోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు గత కొంత కాలం నుండి టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా ఏపీలో బీజేపీ రాబోయే రోజుల్లో కీలకంగా రాణించడం కోసం ఒకపక్క మత రాజకీయాలు చేస్తూనే మరోపక్క టిడిపి పార్టీ ని ఖాళీ చేయటం అనేది టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?