అమరావతి: రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బడిని, గుడినీ వదలని వైసిపి వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంధ్రధనస్సుకి కూడా రంగులు వేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్నవరంలో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్లో ఆర్చిపై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవాల్లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు వైసిపి మతవ్యాప్తిని సూచిస్తున్నాయని కన్నా ఆరోపించారు.