అమరావతి: జగన్మోహనరెడ్డి పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ఫైర్ అయ్యారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి పాలనలా వైసిపి పాలన ఉందని కన్నా విమర్శించారు.
ఒక పక్క ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసిపి వాళ్లు రంగుల పిచ్చితో ఆఖరికి జాతీయ జండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బ తీసే వరకూ వచ్చిందని కన్నా అన్నారు. పంచాయతీ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయడం చట్ట వ్యతిరేకం అని కన్నా పేర్కొన్నారు.
జాతీయ జండా రంగుతో ఉన్న ఓ గ్రామ పంచాయతీ భవనానికి పాత రంగులను చెరిపివేసి వైసిపి రంగులను వేసిన ఫోటోను ‘కన్నా’ దీనికి ట్యాగ్ చేశారు.
వైసీపీ పాలన రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో పాలనలా ఉంది.
ఒక వైపు ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళు రంగుల పిచ్చితో ఆఖరికి జాతీయ జెండాను అవమానించి దేశ ప్రతిష్టను దెబ్బ తీసే వరకూ వచ్చింది..
పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం చట్ట వ్యతిరేకం.. pic.twitter.com/cJNKe76NIl— Kanna Lakshmi Narayana (@klnbjp) October 30, 2019