అమరావతి, జనవరి 29: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జిఒలపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం అడ్డగోలుగా జివోలు విడుదల చేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గిస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. పరిశ్రమలకు భూములు కేటాయింపులు తదితర విషయాలకు సంబంధించి ఇష్టానుసారంగా జివోలు విడుదల చేస్తుందనీ, వీటిపై సిబిఐతో విచారణ జరిపించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.