ఢిల్లీ: బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుకు అనుకోని చేదు అనుభవం ఎదురయ్యింది. గురువారం జివిఎల్ ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చెప్పు విసిరాడు.
ఈ అనూహ్య ఘటనతో జివిఎల్ నిర్ఘాంతపోయారు. చెప్పు విసిరిన వ్యక్తిని కార్యాలయ సిబ్బంది పట్టుకొని బయటకు తీసుకువెళ్లారు. అతనిపై దాడి చేశారు.
చెప్పు విసిరిన వ్యక్తి కాన్పూర్కు చెందిన శక్తి భార్గవ అనే వైద్యుడిగా గుర్తించారు. వ్యక్తిగత కారణాలతోనే దాడికి పాల్పడ్డాడా? లేక ఏదైనా రాజకీయ పార్టీతో అతనికి సంబంధాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.
ఇలాంటి చర్యలకు తాను భయపడేదిలేదని జివిఎల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని ఆయన ఆరోపించారు.
భోపాల్ లోక్సభ అభ్యర్థిగా బిజెపి తరుపున సాధ్వి ప్రజ్ఞాసింగ్ను ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు జివిఎల్ ఈ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.