నాని ట్రాప్ లో బీజేపీ ఇరుక్కుందా..? మంత్రి కొడాలి నాని వేసిన వ్యూహం లో బీజేపీ రాజకీయం చేసుకుంటుందా..? విగ్రహాలు ధ్వంసం, టీటీడీ డిక్లరేషన్ అంశాలపై రాజకీయం చేయాలనుకుంటున్న బీజేపీ… ఆ మాట్లాడిన మంత్రిపైకి దృష్టి మరల్చింది. నిజానికి సంఘ వ్యతిరేక ఘటనలు జరిగినప్పుడు ఆ ఘటననలను తప్పు పట్టాలి, వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలి. మంత్రి ఆ ఘటనలకు అనుకూలంగా మాట్లాడితే అతన్ని టార్గెట్ చేయాలి. అంటే ఇవన్నీ వివాదాస్పద అంశాలే, రాజకీయ అంశాలే. కానీ బీజేపీ మాత్రం మొదటి అంశాలు వదిలేసి, నాని ట్రాప్ లో పడి, నానిని టార్గెట్ గా చేసుకుంది.
బీజేపీ ధోరణి వెరైటీ..!!
హిందూ దేవాలయాలపై దాడులు.., విగ్రహాల ధ్వంసం.., రాజధాని వికేంద్రీకరణ.. టీటీడీ డిక్లరేషన్.. ఇటువంటి అంశాలను రాజకీయం చేస్తున్నారు. ఎస్.., అవి చేయాల్సిన అంశాలే. కానీ బీజేపీ స్థాయి వేరు. వారు తలచుకుంటే ఏదైనా చేయగలరు. కానీ చిన్న కర్రలతోనే జగన్ ని కొడుతున్నారు. జగన్ అవసరం బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బీజేపీకి వైసీపీ ఆపద్భాంధవుడిగా నిలిచింది. “రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక, వ్యవసాయ సంస్కరణ బిల్లులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం” సందర్భంగా బీజేపీకి తోడుగా వైసీపీ నిలబడింది. అటువంటి వైసిపిని రాష్ట్రంలో ఈగలు కూడా వాలకుండా బీజేపీ చూసుకుంటుంది. వాలితే తమ ఈగలే వాలాలి తప్ప వేరే పార్టీ ఈగలు అవకాశం ఇవ్వకూడదు అనేది బీజేపీ నిర్ణయం. అందుకే కేంద్ర స్థాయిలో మిత్రుడిగా ఉన్న వైసీపీ విషయంలో బీజేపీ తమ పాట మార్చేసింది.
కొడాలి నాని మాత్రమే టార్గెట్..!!
వైసీపీ ప్రభుత్వంలో విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్ టీటీడీ డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నారు.., ఇవన్నీ జరిగిన తర్వాత కొడాలి నాని “వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అంటే బీజేపీ టార్గెట్ జగన్, వైసీపీ ప్రభత్వం, వైవీ సుబ్బారెడ్డి, కొడాలి నాని… ఇలా అందరూ బీజేపీకి లక్ష్యంగా ఉండాలి. కానీ అన్నిటినీ వదిలేసినా బీజేపీ కొడాలి నాని పై మాత్రమే పోరాడుతుంది. నానిని బర్తరఫ్ చేయాలంటూ పట్టుపడుతుంది. వైసీపీని, జగన్ ని అనడం మానేసి, కొడాలి నాని విషయంలో బీజేపీ రాజకీయం చేస్తుంది.
* ఇక్కడ అతి పెద్ద వ్యూహం తెలుసుకోవాల్సి ఉంది. జగన్ ని, టీటీడీని, ఈ వివాదాన్ని, హిందూ సెంటిమెంట్ వివాదాన్ని కొడాలి తెలివిగా దారి మళ్లించారు. విపక్షాల టార్గెట్ తనే అయ్యేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్, ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ సేఫ్. తాను మాత్రమే వివాదాస్పదుడిగా మిగిలారు. ఇటువంటివి తనకు కొత్త కాదు. భరిస్తాడు. అందుకే “ఈ గేమ్ స్టార్ట్ చేసింది కొడాలి నాని. తనవైపు తిప్పుకున్నది కొడాలి నాని. ఎదుర్కొని నిలబడతానని నమ్మకంతో ఇది చేస్తున్నది కొడాలి నాని”..! అతని వ్యూహానికి తగ్గట్టే బీజేపీ కూడా దరి మార్చింది. కొడాలి నానిని టార్గెట్ చేస్తుంది. సో.. అదన్నమాట రాజకీయం. దీనికి కర్త, కర్మ, క్రియ మాత్రం ప్రభుత్వ పెద్దలే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?