బాల్వాడీ(మధ్యప్రదేశ్), జనవరి 20: బాల్వాడీ బిజెపి నేత మనోజ్ ఠాక్రే శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాల్వాడీలో ఉదయం నడకకు వెళ్లిన ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి గాయపర్చి పరారు అయ్యారు. రాధాస్వామి భవన్ సమీపంలో మనోజ్ ఠాక్రే మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వర్ల పోలీస్ స్టేషన్ ఇన్చార్జి దినేష్ కుష్వా మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఠాక్రేని హత్యచేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
previous post
next post