అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మహిళలపై పోలీసుల లాఠీ ఛార్జ్, అరెస్ట్ లను రాష్ట్ర మహిళ కమిషన్ పట్టించుకోకపోవడాన్ని బి జె పి మహిళా నేత సాదినేని యామిని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ బ్రతికే ఉందా అంటూ యామిని తీవ్రంగా విమర్శించారు.ఈ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని గొప్పలు చెప్పుకోవడం కాదన్నారు. మహిళల పట్ల ఇంత అమానుషం జరుగుతుంటే, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందించారు కానీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాత్రం ఎక్కడ నిద్రపోతున్నారో అంటూ వ్యాఖ్యానించారు.