Maharashtra Politic’s: బీజేపీ ఎంపీ నవనీత్ రానా మరియు ఆమె భర్త రవి రానా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఇంటిముందు హనుమాన్ చాలీసా పారాయణం చదవనున్నట్లు ప్రకటించటం.. ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించి నట్లయింది. ఈ ప్రకటనతో కోపోద్రిక్తులైన శివసేన సైనికులు… నవనీత రానా ఇంటి వెలుపల.. భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఖైదీ సమయంలో నవనీత రానా ఇంటి బయటకి కూడా వెళ్తాను నన్ను ఎవరు ఆపలేరు… నా పై ఎవరైనా దాడి చేసే దానికి ముఖ్యమంత్రె బాధ్యత వహించాలి అని అన్నారు. ఈ ప్రకటనతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యి.. ఎండి నవనీత రానా ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానా నీ సెక్షన్ 353 ఇండియన్ ప్యానెల్ కోడ్ ప్రకారం అరెస్టు చేశారు. విధి నిర్వహణలో ఒక పబ్లిక్ సర్వెంట్ పై దాడి చేయడం అనే సెక్షన్ కింద లేదా క్రిమినల్ చర్యలు ఉపయోగించే విధానం కింద.. ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పుడు ఈ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నవనీత్ కౌర్ రాజకీయాల్లోకి రాక ముందు తెలుగుతో పాటు పలు భాషలలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆమె భర్త రవి రానా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కి అత్యంత సన్నిహితులు. ఆ తర్వాత నవనీత్ కౌర్ బాబా రాందేవ్ యోగ క్యాంపు లో రవి రాన నీ కలవటం మన పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకోవడం జరిగింది. రవి రానా తో పెళ్లి అయిన తర్వాత నవనీత్ కౌర్.. రాజకీయాలలో యాక్టివ్ గా మారింది.
2014వ సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికలలో.. పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి ఇండిపెండెంట్ గా గెలిచి .. దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఉద్ధవ్ ఠాక్రే నీ నవనీత్ రానా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్దవ్థాకరే హిందుత్వను మర్చిపోయారు అనీ విమర్శలు చేయడం జరిగింది. ఈ గ్రామంలో లో అరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతామని ప్రకటన చేయడంతో.. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. నవనీత్ కౌర్, రవి రానా నీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.