సుజనా చౌదరి.. ఏపీ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా బాగా వినిపిస్తున్న పేరు. చంద్రబాబు నాయుడు నీడ. చంద్రబాబు అధికారం కోల్పోయి వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపిలోకి వెళ్ళి తన రక్షణ తాను చూసుకున్న ఫక్తు రాజకీయ నాయకుడు. పార్టీ మారినా మనసు మొత్తం టిడిపి పైనా, చంద్రబాబు పైనా వేసుకొని టీడీపీ వాదనను భుజాన మోస్తున్న ఒ గొప్ప చంద్రబాబు అభిమాని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ, మండలి రద్దు విషయం లోనూ, అమరావతి రాజధాని విషయంలోనూ బిజెపి ఏం మాట్లాడుతున్నదో లేదో తెలియదు కానీ సుజనా చౌదరి మాత్రం ఇదే బిజెపి నిర్ణయం అంటూ టీడీపీకి అనుకూలంగా ఉన్న నిర్ణయాన్ని తమ నిర్ణయంగా చెప్పుకుంటారు. ఇలా ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. అయితే మూడు రాజధానులు, అమరావతి విషయంలో మాత్రం సుజనా చౌదరి మాటలకు బీజేపీలో ఏ మాత్రం విలువ లేదని, ఒక్క శాతం కూడా విలువ ఇవ్వడం లేదని తేలిపోయింది.
ఇప్పుడు ఏమి చేస్తారు సుజనా?
రాజధాని వికేంద్రీకరణ అంశం గడచిన ఏడు ఎనిమిది నెలల నుండి రాష్ట్రంలో నానుతోంది.
ఈ క్రమంలో ప్రతి 15 రోజులకు ఒక సారి సుజనా చౌదరి మీడియా ముందుకు రావడం రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పడం, కేంద్రం పెద్దలంతా చూస్తున్నారని, సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారంటూ మీడియాకు సర్ది చెప్పడం ప్రజల చెవ్వుల్లొనూ, మీడియా చెవుల్లో పూలు పెట్టడం జరుగుతూ వచ్చేది. నిజంగా సుజనా చౌదరి వంటి లాబీయిస్టు, జాతీయ వ్యాపారవేత్త, కోట్ల కు అధిపతి, మాజీ కేంద్ర మంత్రి ఇంతగా చెబుతున్నారంటే బీజేపీ మూడు రాజధానుల విషయంలో బాగా గట్టిగానే ఆలోచిస్తుందేమో అని అనుకునే వాళ్ళు అందరూ ఈ రోజుతో ఖంగు మీద కంగుతిన్నారు. మూడు రాజధానులు విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయానికి ఒక్క శాతం కూడా అడ్డు చెప్పకుండా బిజెపి నెమ్మదించింది. దీంతో జగన్ ఏమనుకున్నారో రాజధానుల విషయంలో అదే జరిగింది. మరి అమరావతికే జై కొట్టిన సుజనా ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు, ఏమి సమాధానం చెబుతారు. చక్కగా టిడిపిలో ఉంటూ చంద్రబాబు భజన చేసుకుంటూ టీడీపీ తరహా రాజకీయం చేసుకోకుండా కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీ లోకి వెళ్లి మనసును కూడా ఇటు మళ్లించి ఇదే వాదనను వినిపిస్టే పస లేకుండానే నసగా ఉంటుంది. అందుకే టీడీపీలో ఉంటే నెంబర్ 2 తరువాత నెంబర్ 2 స్థాయి నీది. బీజేపీలో వెళ్ళాక టీ కొట్టులో టీ గ్లాస్ గా మారిపోయింది అర్థం చేసుకో వయ్యా.